బుధవారం రామసముద్రం మండలంలో కొత్తిమీర మూటలను లోడ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన మంజుల (40) అనే మహిళ చెవి తెగి తీవ్ర రక్తస్రావమైంది. నారిగానిపల్లి వద్ద కొత్తిమీర కోయడానికి వచ్చిన ఆమె, తోటలో కోసిన కొత్తిమీర మూటలను వాహనంలోకి ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక మూట చెవిపై పడింది. తోటి కూలీలు వెంటనే స్పందించి ఆమెను చికిత్స కోసం చెంబకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.










