మదనపల్లి: రూ. 6. 4కోట్లతో స్వచ్ఛభారత్ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ.

0
2

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లె మున్సిపల్ డంప్ యార్డ్ వద్ద రూ. 6.4 కోట్లతో తడి-పొడి చెత్తను వేరు చేసే కంపోస్ట్ బిల్డింగుల నిర్మాణానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం భూమి పూజ చేశారు. జేసీ శివ నారాయణ శర్మతో కలిసి ఆయన ఈ పనులను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.