అభివృద్ధి మా లక్ష్యం – ఎమ్మెల్యే కొండయ్య

0
8

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ బుర్లవారిపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసి, ఐ.టి.సి కొత్తగా నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ కుటమీ ప్రభుత్వం తరఫున మొదటి తేదీ తెల్లవారుజామునే ప్రతి పేదవాడికి పెన్షన్ పంపిణీ చేశారని అన్నారు. బుర్లవారిపాలెం గ్రామానికి ఇప్పటి వరకు నాలుగు కోట్ల రూపాయలు నిధులుగా కేటాయించామని, జలజీవన్ మిషన్ కింద కోటి 20 లక్షలు రూపాయలు విడుదుల చేశామని, ఐటిసి వారి తరఫున ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించామని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా చీరాల నియోజకవర్గలో పనిచేస్తామని ప్రజలందరికీ ఏ కష్టం వచ్చిన అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు.అనంతరం ప్రజలకు మొక్కలు అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు.