మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన నాగేశ్వరి అనే వివాహిత అనుమా’నాస్పద స్థితిలో అదృ’శ్యం కావడం హైదరాబాద్లో క’లక’లం రే’పుతోంది. గతంలో అన్నోజిగూడలోని ‘త్రిపుర హోటల్’లో హౌస్ కీపింగ్గా పనిచేసి నెల రోజుల క్రితమే ఆ ఉద్యోగం మానేసిన ఆమె, ఈ నెల 2వ తేదీన మరో కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు.
భార్య ఎంతకీ రాకపోవడంతో ఆం’దోళన చెందిన భర్త సురేష్ వర్మ వెంటనే పోలీసులను ఆశ్రయించగా, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగేశ్వరి ఆచూకీ కోసం ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు.










