గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ

0
1

శాయంపేట మండలం లోని మైలారం గ్రామంలో పంచాయతీ రిజిస్టర్ లను తనిఖీ చేసారు ఎంపీఓ రంజిత్ కుమార్.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కి నూతన పాలకవర్గం ఎన్నికైన సమయం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో, వాటిని ప్రజా ప్రయోజనాల కోసం ఎక్కడ వినియోగించారు అని కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. తీర్మానాలు అయినా కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. అదే విధంగా గ్రామ పంచాయతీ పై ఉన్న సుమారు 24 లక్షల విద్యుత్ బిల్లుకు గల కారణాలను తెలుసుకుని , అనవసర వినియోగాన్ని తగ్గించి గ్రామ పంచాయతీ పై భారం తగ్గించే విధంగా పని చేయాలని చెప్పారు.

బెల్టు షాపులను బహిష్కరించాలి
గ్రామంలోని యువజన సంఘాల సభ్యులు అందరూ ఏకమై గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా నడుపుతున్న బెల్టు షాపుల వలన చాలా కుటుంబాలు నష్ట పడుతున్నాయని యువత కూడా మద్యానికి బానిసలు గా మారుతున్నారని కాబట్టి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులను గ్రామ పంచాయతీ తీర్మానం చేసి తొలగించేలా చేయాలని వినతి పత్రం అందచేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.