ఓట్ల తొలగింపును తిప్పికొట్టాలి: మంత్రి వివేక్
ప్రజలందరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, ఎస్ఐఆర్ (SIR) ముసుగులో జరుగుతున్న ఓటర్ల తొలగింపు ప్రక్రియను తీవ్రంగా తిప్పికొట్టాలని మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును జాబితాలో భద్రపరిచేలా ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలన్నారు.
అధికార యంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, రాజకీయ కుట్రలతో ఓట్లను తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవడానికి క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు వారు స్పష్టం చేశారు.









