మదనపల్లె మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూలవాండ్లపల్లికి చెందిన రైతు రమణప్ప (60) తీవ్రంగా గాయపడ్డారు. వ్యవసాయ పొలం వద్దకు నడుచుకుంటూ వెళుతుండగా.
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సహాయంతో రమణప్పను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.










