జూన్ 20న మదనపల్లె రానున్న సీఎం చంద్రబాబు నాయుడు, వాల్మీకి బోయలకు ఇచ్చిన ఎస్టీ పునరుద్ధరణ హామీని వెంటనే అమలు చేయాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన ఆయన, విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన వాల్మీకి బోయల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, మదనపల్లెలోని చిత్తూరు బస్టాండ్ సమీప సర్కిల్ను అధికారికంగా “వాల్మీకి సర్కిల్”గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.










