రాబోయే మూడు గంటల్లో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై, చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో ఉన్నవారు, ప్రయాణికులు చెట్ల కింద నిలబడరాదని అధికారులు సూచించారు.
#Boiena Rajesh










