అన్నమయ్య జిల్లాలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. తిరుపతికి చెందిన వంశీ తన మిత్రులతో కలిసి మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి కారులో వచ్చారు. అర్ధరాత్రి సమయంలో స్థానిక సమాధుల తోట సమీపంలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురికి గాయాలు కాగా, స్థానికులు వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.










