పలమనేరు–కుప్పం–మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ (పీకేఎం ఉడా) పరిధిలోని అనధికార లేఅవుట్లను గుర్తించినట్లు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. గురువారం పీకేఎం ఉడా కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుడుపల్లి మండలంలోని అనధికార లేఅవుట్ల యజమానులకు రెండో విడత నోటీసులు పంచాయతీ కార్యదర్శుల ద్వారా జారీ చేసినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి చేసిన లేఅవుట్లపై చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.










