మదనపల్లె మండలం పాలెంకొండ గ్రామంలో గురువారం ప్రేమకుమారి అనే మహిళపై దాయాదులు మూకుమ్మడిగా దాడి చేశారు. మనవరాలి కాలి వెండి పట్టీని వెంకటేశ్ లాక్కున్నారని నిలదీయడంతో ఈ ఘర్షణ జరిగినట్లు తాలూకా పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ప్రేమకుమారి గాయపడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంకటేశ్ వర్గీయులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










