ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొహం చాటేశాయి. గత వారంలో వర్షాలు కురిసిన అవి అంతంత మాత్రమే. రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడలేదు. ఇప్పటికే విత్తనాలు వేసినా రైతులు తదుపరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో పంటపై ప్రభావం పడుతుంది ఏమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.










