జమ్మలమడుగులో దాల్మియా సిమెంట్ లైన్-2 విస్తరణ పనుల ప్రారంభం|

0
1

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్ సంస్థ చేపట్టిన లైన్-2 విస్తరణ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

సుమారు రూ.3,478 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయి.

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీమతి సవితమ్మ గారు, శ్రీ టీజీ భరత్ గారు, ఎమ్మెల్యే శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ బీటెక్ రవి గారు, ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు, కడప జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు శ్రీ భూపేష్ రెడ్డి గారు, అధికారులు, దాల్మియా సిమెంట్ సంస్థ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.