ఎన్టీఆర్, దామచర్ల విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి|

0
0

స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు & స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు.

కొండపి మండలం నేతివారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు మరియు స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు & కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, యర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ ఏరిక్షిన్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి సుచిత్ర వీరయ్యతో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.