మదనపల్లె: జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కొండామర్రిపల్లి పంచాయతీ టీడీపీ ఇంచార్జ్ జయరాం యాదవ్
మదనపల్లె పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం సమీపంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న ఎన్.జే.ఆర్. కళ్యాణమండపంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘షైనింగ్ స్టార్స్–2026’, ‘మై స్కూల్ మై ప్రైడ్’ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు రవాణా, మౌలిక వసతుల శాఖ మంత్రి, అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొండామర్రిపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జయరాం యాదవ్ జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాయతీ అభివృద్ధి, స్థానిక ప్రజల సమస్యలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.










