ఆసిఫాబాద్‌లో ఏఐటీయూసీ నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక|

0
61

భారత్ ఆవాజ్, న్యూస్ ప్రతినిధి జగదీష్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ (AITUC) జిల్లా మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి విలాస్ ప్రకటించారు.ఈ ఎన్నికలో జిల్లా అధ్యక్షుడిగా దివాకర్, ప్రధాన కార్యదర్శిగా బోగే ఉపేందర్, కోశాధికారిగా సంతోషిని ఎంపికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా రాజగౌడ్, సుధాకర్, మహేష్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా చిరంజీవి, కార్యదర్శులుగా అశోక్, షకీర్ ఎన్నికయ్యారు.వీరితో పాటు కమిటీలో మరొక 15 మందిని కార్యవర్గ సభ్యులుగా, 33 మందిని కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు. జిల్లాలోని కార్మికుల సమస్యలపై నూతన కమిటీ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా బాధ్యులు పేర్కొన్నారు.