● బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన
● బూత్ల వారీగా వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష
● పార్టీ బలోపేతానికి కార్యాచరణపై దిశానిర్దేశం
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 29: బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్య రెడ్డి మచ్చబొల్లారం 133వ డివిజన్ (పాత), 190, 191 డివిజన్లలో బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఈ సందర్భంగా బూత్ల వారీగా ఓటర్ల వివరాలు, బూత్ కమిటీల పనితీరు, ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.
ప్రతి బూత్లో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, వినయ్ శంకర్, శ్రీనివాస్ వర్మ, పద్మిని, కార్తీక్ రెడ్డి, ప్రదీప్, ఉషా, అజిత్తో పాటు బీజేపీ బీఎల్ఓ, ఇన్చార్జీలు, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










