● వర్షపు నీటి నిల్వతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు
● ఏఈ అరుణ్తో కలిసి పరిస్థితిని పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
● వెంటనే నీటి తొలగింపు చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 29: నిన్నటి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అల్వాల్ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్ ప్రాంతంలో భారీగా వర్షపు నీరు నిల్వ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఏఈ అరుణ్తో కలిసి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించిన ఆమె, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే నీటిని తొలగించే చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.
ఈ పరిశీలనలో లక్ష్మణ్, యాదగిరి, మహేందర్, నందిని, అను తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










