ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన.. ఎస్పీకి వినతిపత్రం |

0
3

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్  ఆవాజ్ న్యూస్ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా జిల్లాలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాబోయే ఏడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు స్పష్టం చేశారు. అయితే ఈ నిరసన కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చట్టపరమైన అనుమతులు ఇవ్వాలని కోరుతూ సోమవారం బీఆర్ఎస్ నాయకుల బృందం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నికితా పంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆమెకు ఒక వినతిపత్రాన్ని సమర్పించి, తమ నిరసనల ప్రణాళికను వివరించారు.ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడం ప్రతిపక్షంగా తమ బాధ్యతని, అందుకే ఈ ఏడు రోజుల నిరసన కార్యక్రమాలను రూపొందించామని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా తాము చేపట్టబోయే ఆందోళనలకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందించి, అనుమతులు మంజూరు చేయాలని వారు ఎస్పీని కోరారు. ఎస్పీ నికితా పంత్‌కు వినతిపత్రం అందజేసిన వారిలో బీఆర్ఎస్ ప్రముఖ నాయకురాలు మరసకోల సరస్వతి, అబ్దుల్ కలాం, మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, అలాగే కెరమెరి మండల నాయకుడు అంబాజీతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.