ప్రభుత్వం తక్షణమే నిషేధం విధించాలని ప్రజా గ్రహాలు
హైదరాబాద్/విజయవాడ, సెప్టెంబర్ 4 (భారత్ ఆవాజ్):
రాత్రి సమయంలో వాహనాలపై అమర్చిన అదనపు LED లైట్లు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, కార్ల యజమానులు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ లైట్లకు అదనంగా అధిక శక్తితో కూడిన LED బార్లు, స్ట్రోబ్ లైట్లు, కలర్ లైట్లు అమర్చుకోవడం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు కంటిచూపు మసకబారుతోంది. దీంతో రాత్రిపూట ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.










