విజయనగరం (D) రాజకీయాల్లో బొత్స కుటుంబానికి ఊహించని సవాల్ ఎదురైంది. మేనల్లుడు చిన్న శ్రీను పార్టీని వీడటంతో బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రాబల్యానికి పరీక్ష మొదలైంది. తన కుమార్తె అనూషను జిల్లా పరిషత్ పీఠంపై కూర్చోబెట్టాలని బొత్స భావిస్తుండగా, చిన్న శ్రీను తన కుమార్తె సిరిని అదే పీఠంపై నిలబెట్టేందుకు వ్యూహం రచిస్తున్నారు. దీంతో రాబోయే స్థానిక పోరు మామా–మేనల్లుడి ప్రతిష్ఠాత్మక సమరంగా మారే ఛాన్స్ ఉంది.










