హైదరాబాద్లోని ప్రభుత్వ ENT ఆసుపత్రి ప్రాంగణంలో గత రెండు వారాలుగా మురుగు నీరు పొంగిపొర్లుతూ తీవ్ర సమస్యగా మారింది.
ఆసుపత్రి ఆవరణలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు మలేరియా, డెంగ్యూ, చర్మ వ్యాధుల వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పరిశుభ్రత లోపం కారణంగా దుర్వాసనతో పాటు రోగుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని మురుగు నీరు సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.