తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025 సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రకారం, ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి చివరి వారం నుంచే ప్రారంభం కానున్నాయి.
ప్రాక్టికల్స్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 8 వరకు నిర్వహించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 12 వరకు థియరీ పరీక్షలు జరుగుతాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9:00 నుంచి 12:00 వరకు, రెండవ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యార్థులు తమ హాల్ టికెట్లు, టైమ్ టేబుల్ను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షల షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.