Home South Zone Karnataka డీకేతో ‘ఢీ’ కొట్టిన యతీంద్ర: నాయకత్వ మార్పు సంకేతం

డీకేతో ‘ఢీ’ కొట్టిన యతీంద్ర: నాయకత్వ మార్పు సంకేతం

0

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ చరమాంకంలో ఉన్నారని ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. 2028 ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన ఇప్పటికే ప్రకటించారని యతీంద్ర వెల్లడించారు.

బెలగావిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, సిద్ధరామయ్య తర్వాత కాంగ్రెస్‌లో లిబరల్, సెక్యులర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోలిని ఆ బాధ్యతకు అనువైన వ్యక్తిగా అభివర్ణించారు.

అయితే, పార్టీ నాయకత్వ మార్పుపై తాను ఏ సూచన చేయలేదని, నిర్ణయం హైకమాండ్‌దేనని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో భవిష్యత్‌ నాయకత్వంపై చర్చలకు దారితీయవచ్చు.

NO COMMENTS

Exit mobile version