పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డ్రాగన్ సినిమా అక్టోబర్ 27 నుంచి ట్యునీషియాలో రికీ ప్రారంభించనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ కేటాయించారు. ట్యునీషియా సహజసిద్ధమైన లొకేషన్లు, విస్తృతమైన డెజర్ట్ ప్రాంతాలు, పురాతన నిర్మాణాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఎన్టీఆర్ పాత్రకు తగిన విధంగా యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఉండేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. రికీ అనంతరం నవంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన లభించగా, ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
