టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం “కె ర్యాంప్” థియేటర్లలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది.
యుక్తి తరేజా కథానాయికగా నటించగా, దర్శకత్వం వహించినది జైన్స్ నాని. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్, కిరణ్ కామెడీ పంచ్లు ప్రేక్షకులను అలరించాయి.
ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమా నవంబర్ 15 నుంచి ఆహా ఓటీటీలో (Aha OTT) స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విజయవంతమైన రన్ తర్వాత ఓటీటీలో కిరణ్ అబ్బవరం మరోసారి ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు.
