ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఉద్యమానికి సిద్ధమైంది. ఈనెల 28న రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మేరకు పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ ధర్నాలు నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు.




