మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తాడు బందు హనుమాన్ దేవాలయంలో శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 41 రోజుల పాటు జరుగుతున్న అయ్యప్ప స్వాముల అల్పాహారం సేవలో భాగంగా, 14వ రోజున భక్తులకు అల్పాహారం అందించడం జరిగింది.
ఈ అల్పాహార సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాగిరి ఆనంద్ బాబు, మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, గణేష్ టెంపుల్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ యాదవ్,అప్పల నాగేష్ యాదవ్,బాలంరాయి రవి తదితరులు పాల్గొన్నారు
#Sidhumaroju
