Home South Zone Andhra Pradesh డిసెంబర్ 22న ప్రజా సమస్యల వినతుల స్వీకరణ |

డిసెంబర్ 22న ప్రజా సమస్యల వినతుల స్వీకరణ |

0

*పత్రికా ప్రకటన*
*ఎన్టీఆర్ జిల్లా

*డిసెంబర్ 22న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..*
* *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*

డిసెంబర్ 22వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను *Meekosam.ap.gov.in* వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని .. నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు *1100* కి నేరుగా కాల్ చేయవచ్చన్నారు.
………………………………..
*(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)*

NO COMMENTS

Exit mobile version