ఆదిలాబాద్లో సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉన్న విమానాశ్రయ నిర్మాణ పనులను త్వరలోనే పట్టాలెక్కిస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
శుక్రవారం ఆయన స్థానిక ఎయిర్పోర్టు మైదానాన్ని సందర్శించి, విమానాశ్రయ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భూసేకరణ ప్రక్రియ, రన్వే మ్యాపింగ్, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
# shivaji
