Home South Zone Andhra Pradesh మోతుకపల్లి గ్రామ పర్యావరణ విప్లవం: రతన్ టాటా గారికి పచ్చని నివాళి

మోతుకపల్లి గ్రామ పర్యావరణ విప్లవం: రతన్ టాటా గారికి పచ్చని నివాళి

0

మోతుకపల్లి గ్రామ పర్యావరణ విప్లవం: రతన్ టాటా గారికి పచ్చని నివాళి
శ్రీ హరిహరసుత మహాగణపతి అనుగ్రహంతో… మోతుకపల్లి గ్రామ పర్యావరణ విప్లవం ప్రారంభం
హిందూపురం సబ్ కలెక్టర్ గారి పర్యావరణ దార్శనికతను స్ఫూర్తిగా తీసుకుని, మోతుకపల్లి గ్రామ ప్రజల అఖండ భాగస్వామ్యంతో ఒక బృహత్తర మొక్కలు నాటే కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడింది.

కార్యక్రమ లక్ష్యం:
కేవలం మొక్కలు నాటడమే కాకుండా, నాటిన ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, మోతుకపల్లిని ఒక పచ్చని వనంగా మార్చడం మరియు ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం.

నాయకత్వం మరియు అతిథులు:
నిర్వాహకులు: వేణుగోపాల్ (సామాజిక మరియు పర్యావరణ కార్యకర్త).
ముఖ్య అతిథి: S. రామాంజనేయులు గారు (ముదరెడ్డిపల్లి BJP సీనియర్ నాయకులు).
గౌరవ అతిథులు: చారుకీర్తి గారు (హిందూ సంరక్షకుడు), లక్ష్మీనారాయణ గారు (మాజీ కౌన్సిలర్, YSRCP), భాస్కర్ రెడ్డి గారు (మానవ హక్కుల మరియు పర్యావరణ కార్యకర్త).

రవిచంద్ర గారు (అడ్వకేట్), బంగారు చంద్ర గారు (BJP పరిగి మండల నాయకులు), ప్రకాష్ గారు (గోరక్ష కార్యకర్త), RSS నాయకులు మరియు సభ్యులు, ఛత్రపతి శివాజీ టీమ్ సభ్యులు, మరియు భారత్ సింగ్ సేవా సమితి బృందం.

సహకారం మరియు క్షేత్రస్థాయి సేవలు:
చిల్మత్తూరు ఫారెస్ట్ నర్సరీ సహకారంతో జరిగిన ఈ యజ్ఞంలో, మొక్కల రవాణా మరియు క్షేత్రస్థాయి పనుల్లో అహర్నిశలు శ్రమించిన వారు: నరేష్, శ్రీధర్, దివాకర్, మంజు, జయప్ప, పవన్, అజయ్, గంగాధర్ సి, గంగాధర్ బి, మళి, చైతన్య, ఆదినారాయణ రెడ్డి, లోకేష్ బి , అభిమరియు మరెంతో మంది హిందూ ఆత్మబంధువులు.

గ్రామస్తుల సందేశం:
“మా గ్రామం – మా బాధ్యత!” “రతన్ టాటా గారి స్మృతిలో మేము నాటిన ప్రతి మొక్కను రక్షించుకుంటామని మోతుకపల్లి గ్రామ ప్రజలందరం ప్రతిజ్ఞ చేస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారి ఆశయాలకు తోడుగా, మా గ్రామాన్ని జిల్లాలోనే అత్యంత పచ్చని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాము.”

NO COMMENTS

Exit mobile version