ఈ రోజు ది.30.12.2025 తేది మంగళవారం మధ్యాహ్నం 02.45 గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు రహదారి భద్రత, మద్యం మరియు డ్రగ్స్ సేవించి వాహనాలు నడపడం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించు నేపధ్యంలో 2K వాక్తాన్ ర్యాలి .
నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఈగల్ IGP శ్రీ *ఆకే* *రవికృష్ణ* IPS గారి మరియు SP (Ops) శ్రీ M. మహేశ్వర రాజు గారి మరియు SP(Admin) శ్రీ K. నగేష్ బాబు గారి ఆదేశాల మేరకు విజయవాడ ఈగల్ టీం హాజరు కావటం జరిగింది.
ఈ కార్యక్రమం లో గౌరవ నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు డ్రగ్స్ వద్దుబ్రో, సే నో టూ డ్రగ్స్ అనే Eagle పోస్టర్లు విడుదల చేసారు. నగర కమిషనర్ గారు మాట్లాడుతూ మద్యం, డ్రగ్స్ సేవించి వాహనాలు నడపటం చట్టప్రకారం నేరం కావున ఇటువంటి వాటికి ఎవరైనా పాల్పడితే చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తాము.
అదేవిదంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఏవైనా గంజాయి, డ్రగ్స్ త్రాగటం వంటివి చేస్తే NDPS Act ప్రకారం కఠినంగా శిక్సిస్తాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో విజయవాడ నగర కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజశేఖర్ బాబు IPS గారు, నగర ట్రాఫిక్ DCP శ్రీమతి Shareen Begum, IPS గారు, ఈగల్ టీం సభ్యులు, ట్రాఫిక్ పోలీస్ లు, NGO సభ్యులు పాల్గొన్నారు.
*EAGLE CELL*
*VIJAYAWADA* 🙏.
