స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58 కోట్లు కాజేసిన మోసగాళ్లు
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్(జేడీ) వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ సైబర్ మోసానికి గురయ్యారు.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడితో 500% లాభాలు చూస్తారన్న మాటలు నమ్మి, ఆమె 2025 డిసెంబరు 24 నుంచి జనవరి 5 మధ్య 19 విడతలుగా మొత్తం రూ.2.58 కోట్లను పెట్టుబడి పెట్టారు. ఇందుకోసం తనతో పాటు తన భర్త వద్ద ఉన్న బంగారంపై రుణం తీసుకున్నారు.
చివరికి మోసపోయానని గ్రహించి, ఈనెల 6న హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
