ఏపీ పునర్నిర్మాణ ప్రక్రియ గాడిన పడిందని గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అసెంబ్లీలో పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్డీపీ రూ.17.62 లక్షల కోట్లకు, తలసరి ఆదాయం రూ.2.95 లక్షలకు పెరిగిందని వెల్లడించారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని, ‘సూపర్ సిక్స్’ హామీల అమలుతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీని వృద్ధి పథం వైపు నడిపిస్తున్నట్లు ఆయన ఉద్ఘాటించారు.
రాష్ట్ర జీఎస్డీపీ (GSDP)రూ. 17.62 లక్షల కోట్లు (10.75% వృద్ధి)
తలసరి ఆదాయంరూ. 2.95 లక్షలు
వ్యవసాయ రంగ వృద్ధి: 7.83%
పారిశ్రామిక వృద్ధి: 9.53%
సేవల రంగ వృద్ధి: 12.94%
