దోర్నాల మండలం కేజీ రోడ్డు నుండి నల్లగుంట్ల వరకు రూ.2 కోట్లతో చేపట్టనున్న 3.4 కి.మీ. తారు రోడ్డు పనులకు యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. గ్రామీణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. అనంతరం ఉజ్వల యోజన కింద మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్రామాల రూపురేఖలు మారుస్తాం: రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో గూడూరి ఎరిక్షన్ బాబు.
