నెల్లూరు జిల్లా ‘ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర’లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం జగన్పై నిప్పులు చెరిగారు.
జగన్ ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మగా మారారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే సత్తా ఆయనకు లేదని విమర్శించారు.
కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని ఆరోపిస్తూ, రాష్ట్ర ఎంపీలంతా బీజేపీకి బినామీలుగా మారారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి సువర్ణాధ్యాయం మొదలవుతుందని ఆమె స్పష్టం చేశారు.
