మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గట్టిగా పోరాడాలని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ కోరారు.
పట్టణ ట్రాఫిక్ సమస్యను సభ దృష్టికి తీసుకెళ్లడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన, నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన మదనపల్లి మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ప్రభుత్వం నుండి తక్షణమే నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి చేయాలని ఆయన సూచించారు.
