మదనపల్లెలో బాలికను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడు కులవర్ధన్ను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన సీఐ మహమ్మద్ రఫీ..
నిందితుడు బాలికను హతమార్చి మృతదేహాన్ని డ్రమ్ములో దాచినట్లు గుర్తించారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
