“మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఈనెల 25న ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది! కలెక్టర్ రాజాబాబు గారు కొత్తూరు, గంటవానిపల్లిలో హెలిప్యాడ్ మరియు సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు.
వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం కాన్వాయ్కి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని, పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.”
