పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరులో బుధవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. గత 15 ఏళ్లుగా స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న సదరు వ్యక్తి, విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవాడని గ్రామస్థులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న కల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి పూర్తి వివరాల కోసం కేసు నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
#కొత్తూరు మురళి.
