ఢిల్లీ ఏఐ సమ్మిట్లో సీఎం చంద్రబాబు ఏపీని టెక్నాలజీ హబ్గా నిలిపేలా ఐబీఎం, ఐఐటీ మద్రాస్ వంటి దిగ్గజ సంస్థలతో 7 ఒప్పందాలు చేసుకున్నారు.
దీని ద్వారా 10 లక్షల మంది యువతకు ఏఐ శిక్షణ, అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం ఏఐ యూనివర్సిటీ, ఐఐటీ మద్రాస్ భాగస్వామ్యంతో పాఠశాల విద్యార్థులకు ‘ఏఐ ట్యూటర్’ ఏర్పాటు కానున్నాయి.
విశాఖను గూగుల్ డేటా హబ్గా మారుస్తూ, అత్యాధునిక సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
