Home South Zone Andhra Pradesh కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్

కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్

0

పెద్దాపురం వృద్ధాశ్రమ నిర్మాణానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి ₹50 లక్షలు మంజూరు చేసిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ‘ప్రశాంత నిలయం’ పనుల పురోగతిని వివరించిన వారు, కాకినాడ బోట్స్ క్లబ్‌లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ‘డే కేర్ సెంటర్’ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ, వృద్ధుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని హామీ ఇచ్చారు.

NO COMMENTS

Exit mobile version