తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి హోప్ ఐలాండ్కు 15 మంది పర్యాటకులతో వెళ్తున్న టూరిజం బోటు సముద్రం మధ్యలో సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. బోటు అకస్మాత్తుగా మొరాయించడంతో పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ బోటును పంపి, పర్యాటకులందరినీ సురక్షితంగా తీరానికి చేర్చారు. బోట్ల ఫిట్నెస్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని పర్యాటకులు అధికారులను కోరారు.
