మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న అంజలి (నిందితుడు కులవర్ధన్ తల్లి) కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ ఇప్పటికే చెరువులో మృతి చెందగా, ఈ ఘోరానికి అంజలి సహకరించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆమె ప్రస్తుతం పరారీలో ఉండటంతో బెంగళూరు సహా ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చట్టం తన పని తాను చేస్తుందని, త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.










