Home South Zone Andhra Pradesh ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న ‘ఆంధ్రా శబరిమలై’

ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న ‘ఆంధ్రా శబరిమలై’

0

కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని పెదమల్లాపురం వద్ద వెలసిన ఆంధ్రా శబరిమలై పుణ్యక్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది.

నాగులకొండల మధ్య లక్ష గజాల విస్తీర్ణంలో, కేరళ శబరిమలై తరహాలో ఈ ఆలయం నిర్మితమైంది. పర్వత శిఖరంపై ప్రతిష్ఠించిన శివుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక్కడ ప్రతి ఏడాది నిర్వహించే వనయాత్ర, మకర జ్యోతి దర్శనం ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతున్నాయని ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version