విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రేపు (ఫిబ్రవరి 22) జిల్లాలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఉదయం 8:30 గంటలకు రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ప్రారంభోత్సవంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి హాజరవుతారు.
అనంతరం 11 గంటలకు చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరలో పాల్గొంటారు. మధ్యాహ్నం నుండి నియోజకవర్గ పరిధిలోని పలు స్థానిక కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకోనున్నారు.
