బ్రిటిష్ వలస పాలనపై సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని డీఆర్వో మధుసూదన రావు పేర్కొన్నారు.
ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించిన ఆయన వర్ధంతి వేడుకల్లో డీఆర్వో నివాళులర్పించారు. 1846లోనే ఈస్ట్ ఇండియా కంపెనీ అణచివేతను ఎదిరించిన మహోన్నత వ్యక్తి ఆయనని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక, యువజన సర్వీసుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
