Home South Zone Andhra Pradesh మదనపల్లెలో తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ

మదనపల్లెలో తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ

0

మదనపల్లె పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో ఆదివారం భారీ ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి కడప వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో స్తంభం విరిగి రోడ్డుపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రమాద సమయంలో జనం లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు.

NO COMMENTS

Exit mobile version