తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ‘సిట్’ (SIT) నివేదికలోని సంచలన అంశాలను బయటపెట్టారు.
గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు మార్చి జంతువుల కొవ్వు, ప్రమాదకర రసాయనాలతో కూడిన నెయ్యిని సరఫరా చేశారని ఆరోపించారు.
అప్పటి టీటీడీ చైర్మన్ పీఏ ఖాతాలో రూ. 4.69 కోట్ల లంచం దొరికిందని, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఈ ‘మహా పాపం’పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
